కరోనా అంతం కోసం నరబలి.. పూజారి అరెస్టు
ABN , First Publish Date - 2020-05-29T23:40:40+05:30 IST
ఒరిస్సాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక ఆలయానికి వచ్చిన ఓ భక్తుడి తలను అక్కడి పూజారి పాశవికంగా...
భువనేశ్వర్: ఒరిస్సాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక ఆలయానికి వచ్చిన ఓ భక్తుడి తలను అక్కడి పూజారి పాశవికంగా నరికేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ పూజారిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బంధాహుడా ప్రాంతంలోని నరసింహపూర్ బ్లాక్లో ఉన్న బ్రాహ్మణి ఆలయంలో సంసారీ ఓఝా(75) అనే వ్యక్తి పూజారిగా వ్యవహరిస్తున్నాడు. బుధవారం రాత్రి సరోజ్ కుమార్ ప్రధాన్(55) అనే వ్యక్తి ఆలయానికి వచ్చాడు. అమ్మవారిని దర్శించుకుని మోకరిల్లి నమస్కరించాడు. అదే తరుణంలో వెనకనుంచి వచ్చిన పూజారి ప్రధాన్పై కొడవలితో దాడి చేసి తల నరికేశాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి లొండిపోయాడు.
విచారణలో కరోనాను అడ్డుకునేందుకు అమ్మవారే ఇలా చేయమని చెప్పిందని, అందుకే తాను హత్య చేశానని పేర్కొన్నాడు. అయితే దీనిపై స్పందించిన పోలీసులు, ప్రధాన్కు ఓఝాకు మధ్య ఓ మామిడి తోటకు సంబంధించి వివాదాలున్నాయని, దాని కారణంగానే ఈ ఓఝా హత్య చేసి ఉంటాడని చెబుతున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.