అయ్యో.. పూజే.. పూజారిని బలిగొందా..!

ABN , First Publish Date - 2021-08-21T19:49:51+05:30 IST

అనంతపురం: దేవుని పూజలో నిత్యం తరించే ఆ పూజారిని.. అదే పూజ బలిగొంటుందని ఎవరూ ఊహించలేదు. జిల్లాలోని శింగనమల సమీపంలో గంపమల్లయ్య స్వామి కొండపై శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

అయ్యో.. పూజే.. పూజారిని బలిగొందా..!

అనంతపురం: దేవుని పూజలో నిత్యం తరించే ఆ పూజారిని.. అదే పూజ బలిగొంటుందని ఎవరూ ఊహించలేదు. జిల్లాలోని శింగనమల సమీపంలో గంపమల్లయ్య స్వామి కొండపై శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుమల ఏడుకొండలకు మారు పేరుగా ఈ స్వామిని భక్తులు పూజిస్తూ ఉంటారు. భక్తులకు కనిపించని దేవుడు.. పూజారికి మాత్రమే కనిపిస్తాడు అని ప్రజల విశ్వాసం. ఆయనలోనే దేవుడిని చూసుకుంటూ పూజలు చేస్తుంటారు. 


 శ్రావణమాసం కావడంతో స్వామికి పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ పాపయ్య అనే వ్యక్తి.. స్వామికి వంశపారంపర్యంగా పూజలు చేస్తూ ఉంటారు. శనివారం కూడా యథావిధిగా పూజ చేస్తున్నారు. ఈ క్రమంలో కొండ పైనుంచి గుహలోకి దిగే క్రమంలో ఒక్కసారిగా కాలు జారి లోయలో పడ్డాడు. భక్తులందరూ చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. ఊహించని ఈ ప్రమాదానికి అక్కడున్న భక్తులంతా షాక్ అయ్యారు. పూజారి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. నిత్యం స్వామి పూజలో తరించే ఆ పూజారి.. అదే పూజలో ఉండగానే మృతి చెందడాన్ని భక్తులు జీర్ణించుకోలేకున్నారు.

Updated Date - 2021-08-21T19:49:51+05:30 IST