రామాలయం భూమి పూజ : లడ్డూల పంపిణీకి రావణుడి గుడి పూజారి సన్నాహాలు
ABN , First Publish Date - 2020-08-04T21:39:31+05:30 IST
శతాబ్దాలనాటి కల సాకారమయ్యే క్షణాల కోసం రావణుడి గుడి పూజారి ఆనందోత్సాహాలతో
అయోధ్య : శతాబ్దాలనాటి కల సాకారమయ్యే క్షణాల కోసం రావణుడి గుడి పూజారి ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారు. అంగరంగ వైభవంగా ముస్తాబైన అయోధ్యలో, శ్రీరాముడు జన్మించిన భూమిలో, రామాలయం నిర్మాణానికి ఆగస్టు 5న భూమి పూజ జరిగే సమయంలో లడ్డూలు పంచాలని ఉత్సాహంతో ఉన్నారు.
రావణుడి గుడి బిస్రఖ్లో ఉంది. ఈ గుడి పూజారి మహంత్ రామ్దాస్ మాట్లాడుతూ, బుధవారం జరిగే రామాలయ భూమి పూజ కోసం తాను చాలా ఆత్రుతగా, ఆనందంగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత తాను అందరికీ లడ్డూలు పంచుతానని చెప్పారు.
అయోధ్యలో రామాలయం నిర్మితమవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. భూమి పూజ కార్యక్రమం పూర్తి కాగానే తాను లడ్డూలు పంచుతానన్నారు. రామాలయానికి భూమి పూజ జరుగుతుండటం చాలా శుభ పరిణామమని చెప్పారు. అద్భుతమై, దివ్యమైన దేవాలయం నిర్మితమవుతుండటం చాలా సంతోషకరమని చెప్పారు.
రావణాసురుడి వల్లే శ్రీరామునికి గొప్ప ప్రజాదరణ లభించిందన్నారు. శ్రీరాముడు, రావణాసురుడు ప్రజాదరణ పొందడానికి ఒకరికొకరు కారణమని చెప్పారు.
రావణాసురుడు లేకపోతే శ్రీరాముడి గురించి ఎవరికీ తెలిసేది కాదన్నారు. శ్రీరాముడు లేకపోతే రావణాసురుడి గురించి కూడా ఎవరికీ తెలిసేది కాదన్నారు.
రావణాసురుడు బిస్రఖ్లోనే జన్మించాడని, దీనిని రావణుడి జన్మభూమి అంటారని చెప్పారు. రావణాసురుడు గొప్ప జ్ఞాని అని, తెలివైనవాడని చెప్పారు. సీతా దేవిని అపహరించిన తర్వాత లంకకు తీసుకెళ్ళి, అశోక వాటికలో ఆమెను ఉంచాడని, తన అంతఃపురంలో ఉంచలేదని చెప్పారు. అంతేకాకుండా రావణాసురుడు సీతాదేవి రక్షణ కోసం మహిళలనే నియమించాడన్నారు. శ్రీరాముడిని మర్యాదాపురుషోత్తముడని అంటే, రావణాసురుడిని కూడా కొంత వరకు అదేవిధంగా పిలవవచ్చునని చెప్పారు.
బిస్రఖ్లోని రావణాసురుడి గుడిలో మహాశివుడు, పార్వతీ దేవి, కుబేరుడు విగ్రహాలు కూడా ఉన్నాయి.