నేటి నుంచి విధులకు ప్రైమరీ స్కూళ్ల టీచర్లు
ABN , First Publish Date - 2021-03-03T05:42:46+05:30 IST
నేటి నుంచి విధులకు ప్రైమరీ స్కూళ్ల టీచర్లు
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్): ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు బుధవారం నుంచి పాఠశాలలకు రెగ్యులర్గా హాజరు కావాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు ప్రారంభమైన తరువాత ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఒకరోజు తప్పించి మరొకరోజు విధులకు హాజరవుతున్నారు. అయితే నేటి నుంచి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతిరోజూ విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు.