ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలి
ABN , First Publish Date - 2021-08-02T04:39:55+05:30 IST
నూతన విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయా లని ఉద్దాన ప్రాంత విద్యావేదిక సభ్యులు కోరారు. ఆదివారం నీలావతిలో ఉద్దానం విద్యావేదిక ఆధ్వర్యంలో నూతన విద్యావిధానంపై సమావేశం నిర్వహించారు.
పలాస రూరల్: నూతన విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని ఉద్దాన ప్రాంత విద్యావేదిక సభ్యులు కోరారు. ఆదివారం నీలావతిలో ఉద్దానం విద్యావేదిక ఆధ్వర్యంలో నూతన విద్యావిధానంపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వేదిక అధ్యక్షుడు కుత్తుం సుధాకర్ మాట్లాడుతూ.. 172 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యువీవీ గౌరవాధ్యక్షుడు బి.ఓంకార్, ప్రధాన కార్యదర్శి టి. వాసుదేవరావు, కన్వీనరు కె.ప్రకాశరావు పాల్గొన్నారు.