నాగర్కర్నూల్ ప్రమాదంపై ప్రధాని సంతాపం
ABN , First Publish Date - 2021-07-24T04:29:29+05:30 IST
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ
నాగర్కర్నూల్: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ప్రార్థించారు.
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఉప్పునూతల మండలం చెన్నారం గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో చిక్కుకున్న మృతదేహాలను సిబ్బంది వెలికితీస్తున్నారు.