బంగారపు రంగు ధోతి, కుర్తాలో మెరిసిన మోదీ

ABN , First Publish Date - 2020-08-05T18:03:20+05:30 IST

రామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో రామాలయం భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బంగారపు రంగు ధోతి, కుర్తా ధరించి ధగ ధగ మెరిశారు.....

బంగారపు రంగు ధోతి, కుర్తాలో మెరిసిన మోదీ

అయోధ్య :రామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో రామాలయం భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బంగారపు రంగు ధోతి, కుర్తా ధరించి ధగ ధగ మెరిశారు. బుధవారం బంగారు రంగు సంప్రదాయ ధోతి, కుర్తా ధరించిన మోదీ అయోధ్యకు వచ్చి హనుమాన్, రాంలాలా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మోదీ బంగారపు రంగు కుర్తాకు ఆఫ్ వైట్, బంగారపు రంగు అంచున్న ధోతి ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. మోదీ ధోతి, కుర్తాతోపాటు నల్లరంగు బూట్లు, ముఖానికి మాస్కు ధరించి చారిత్రాత్మక భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భూమి పూజా కార్యక్రమంలో ప్రధానితోపాటు అందరూ సామాజిక దూరం పాటించారు. అతిథులంతా ముఖాలకు మాస్కులు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాలయం భూమి పూజా కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ శ్రీరామ్ జన్మభూమి మందిరంపై స్మారక తపాలా బిళ్లను కూడా విడుదల చేశారు.

Updated Date - 2020-08-05T18:03:20+05:30 IST