సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-01-13T23:06:39+05:30 IST

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు.

సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్‌ సమావేశం

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశమై దేశంలో కోవిడ్ పరిస్థితిపై చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం గతంలో విడుదల చేసిన 23 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకున్నాయని, ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను మెరుగుపరిచాయని ప్రధాని చెప్పారు. దేశంలో ఇప్పటివరకూ అర్హులైన వారిలో 92 శాతం మందికి తొలి డోసు, 70 శాతం మందికి రెండో డోస్ ఇచ్చామన్నారు. 17 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు వారు 3 కోట్ల మందికి పైగా టీకాలు తీసుకున్నారని ప్రధాని చెప్పారు. సామాన్యుల ఆర్ధిక పరిస్థితులకు విఘాతం కలగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు. 





Updated Date - 2022-01-13T23:06:39+05:30 IST