అస్సాం సీఎం సోనోవాల్కు మోదీ ఫోన్.. వరద పరిస్థితిపై ఆరా
ABN , First Publish Date - 2020-07-04T05:06:12+05:30 IST
న్యూఢిల్లీ: అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. అస్సాంలో వరద పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయమందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు
న్యూఢిల్లీ: అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. అస్సాంలో వరద పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయమందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
మరోవైపు వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. అస్సాంలోని 22 జిల్లాల్లోని 16.03 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. ఇప్పటివరకూ 34 మంది చనిపోయారు.