ప్రధాని పర్యటన వాయిదా

ABN , First Publish Date - 2022-01-07T13:37:35+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 12న ఆయన మదురై సహా విరుదునగర్‌, పుదుచ్చేరిలో పర్యటించాల్సి వున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా సమావేశాలు, ఉత్సవాలు

ప్రధాని పర్యటన వాయిదా

                        - బీజేపీ అధ్యక్షుడు అన్నామలై


ప్యారీస్‌(చెన్నై): ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 12న ఆయన మదురై సహా విరుదునగర్‌, పుదుచ్చేరిలో పర్యటించాల్సి వున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా సమావేశాలు, ఉత్సవాలు తదితరాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ప్రధాని పర్యటన కూడా రద్దయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. కరోనా, ఒమైక్రాన్‌ తీవ్రత , ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని కార్యక్రమాన్ని వాయిదా వేశామని అన్నామలై పేర్కొన్నారు. ఈ నెల 12న పొంగల్‌ వేడుకలను రాష్ట్ర బీజేపీ మదురైలో ‘మోడీ పొంగల్‌’ పేరుతో భారీ ఏర్పాట్లతో నిర్వహించ తలపెట్టింది. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు పాల్గొనేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని కార్యక్రమం రద్దయింది.

Updated Date - 2022-01-07T13:37:35+05:30 IST