గంభీర్‌ రెండేళ్ల జీతం విరాళం

ABN , First Publish Date - 2020-04-03T09:54:52+05:30 IST

కరోనా వైరస్‌ నివారణకు ‘ప్రధాన మంత్రి కేర్స్‌ ఫండ్‌’కు భారత మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తన రెండేళ్ల జీతాన్ని...

గంభీర్‌ రెండేళ్ల జీతం విరాళం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నివారణకు ‘ప్రధాన మంత్రి కేర్స్‌ ఫండ్‌’కు భారత మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తన రెండేళ్ల జీతాన్ని విరాళంగా ప్రకటించాడు. ‘దేశం తమ కోసం ఏం చేసిందని ప్రజలు అడుగుతుంటారు. అయితే మనం దేశం కోసం ఏం చేశామన్నదే అసలైన ప్రశ్న. దేశం కరోనాను దీటుగా ఎదుర్కోవడానికి పీఎం కేర్స్‌ ఫండ్‌కు రెండేళ్ల జీతాన్ని విరాళంగా ఇస్తున్నా. మీరు కూడా సాయం చేయడానికి ముందుకు రండి’ అని గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-04-03T09:54:52+05:30 IST