పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి
ABN , First Publish Date - 2020-06-02T09:22:15+05:30 IST
వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుని ప్రజారోగ్యాన్ని కాపాడాలని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్
కాకినాడ కార్పొరేషన్, జూన్ 1: వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుని ప్రజారోగ్యాన్ని కాపాడాలని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ అన్నారు. జగన్నాథపురం, జె.రామారావుపేట ప్రాంతాలను సోమవారం ఆయన పరిశీలించారు. పారిశుధ్య మెరుగుకు సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్లు మరింత శ్రద్ధగా పనిచేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్తకు సంబంధించి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.