పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-01-19T21:54:57+05:30 IST

ద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని, దీంతో తాండూరు నియోజకవర్గ పరిధిలోని 258 పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు

పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

తాండూరు/బంట్వారం (కోట్‌పల్లి) : విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని, దీంతో తాండూరు నియోజకవర్గ పరిధిలోని 258 పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈడీ సీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిన్‌గుర్తి సమీపంలో నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి నెలాఖరులన మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ది పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 258 ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి చేసేందుకు మండలాలవారీగా నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 

Updated Date - 2022-01-19T21:54:57+05:30 IST