ప్రైవేట్ బస్సు ఢీకొని కారు ధ్వంసం
ABN , First Publish Date - 2021-03-05T16:46:12+05:30 IST
ప్రైవేట్ బస్సు ఢీకొని కారు ధ్వంసమైంది. కారులో ఉన్న వారు క్షేమంగా
హైదరాబాద్: ప్రైవేట్ బస్సు ఢీకొని కారు ధ్వంసమైంది. కారులో ఉన్న వారు క్షేమంగా బయటపడ్డారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్కు చెందిన ఎ.జ్యోతిర్మయి ఇంజనీర్. కారులో ఎన్బీవీ సత్యనారాయణతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి బంజారాహిల్స్లోని ఓ ఆస్పత్రికి వెళ్తోంది. కారు పంజాగుట్ట మోడల్ హౌస్ వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు కారును ఢీకొట్టింది. కారు ధ్వంసం కాగా.. అందులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో పంజాగుట్ట ప్రధాన రహదారిలో ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. జ్యోతిర్మయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ తనను దూషించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.