‘18 లక్షలు కడితేనే మృతదేహాన్నిస్తాం...’

ABN , First Publish Date - 2021-06-03T17:26:35+05:30 IST

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల తీరు ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు ఏదో ఒక వార్త ప్రైవేటు ఆసుపత్రుల

‘18 లక్షలు కడితేనే మృతదేహాన్నిస్తాం...’

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల తీరు ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు ఏదో ఒక వార్త ప్రైవేటు ఆసుపత్రుల అమానుషంపై వెలుగు చూస్తూనే ఉంది. హైదరాబాద్ వనస్థలిపురంలోని ప్రగ్మా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మల్లారెడ్డి (70) అనే వ్యక్తి మృతి చెందాడు. 20 రోజులకు 18 లక్షల బిల్లు వేసి చివరకు శవాన్ని అప్పగిస్తామంటున్నారని ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. మొదట ఆరు లక్షలు కట్టామని.. మిగిలిన 12లక్షలు కట్టి శవాన్ని తీసుకెళ్లాలని అంటున్నారని బంధువుల ఆరోపిస్తున్నారు.


Updated Date - 2021-06-03T17:26:35+05:30 IST