ప్రైవేటు స్కూల్ టీచర్లకు, సిబ్బందికి అందని సాయం

ABN , First Publish Date - 2021-04-28T22:39:28+05:30 IST

రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు రూ.2 వేల ఆర్థికసాయంతోపాటు కుటుంబానికి 25 కేజీల

ప్రైవేటు స్కూల్ టీచర్లకు, సిబ్బందికి అందని సాయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు రూ.2 వేల ఆర్థికసాయంతోపాటు కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే  ప్రైవేటు స్కూల్ టీచర్లకు, సిబ్బందికి సీఎం ప్రకటించిన సాయం ఇంకా అందలేదు. రెండు వేల రూపాయలు, 25 కిలోల బియ్యం కోసం ప్రైవేట్ స్కూల్ సిబ్బంది ఎదురు చూస్తున్నారు. డీఈఓ కార్యాలయాల చుట్టూ ప్రైవేట్ టీచర్లు తిరుగుతున్నారు. 1.45 లక్షల మందికి సహాయం అందిస్తామని సర్కార్ చెప్పింది. అయితే తెలంగాణలో మొత్తం ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లు, సిబ్బంది సుమారు మూడు లక్షలున్నారు. రాష్ట్రంలో 1.24 లక్షల మందిని  విద్యాశాఖ గుర్తించింది. ఇప్పటివరకు 99 వేల మందికి సాయం అందింది. ఇంకా 60 శాతం మందికి సాయం అందలేదు. సాయం అందక  టీచర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2021-04-28T22:39:28+05:30 IST