ప్రైవేట్ టీచర్లకు 2 వేల ఆర్థిక సహాయాన్ని అకౌంట్లలో వేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-05-19T21:23:39+05:30 IST

పెండింగ్‌లో ఉన్న ప్రైవేట్ టీచర్లకు 2 వేల ఆర్థిక సహాయాన్ని తెలంగాణ విద్యాశాఖ అకౌంట్లలో వేసింది.

ప్రైవేట్ టీచర్లకు 2 వేల ఆర్థిక సహాయాన్ని అకౌంట్లలో వేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న ప్రైవేట్ టీచర్లకు 2 వేల ఆర్థిక సహాయాన్ని తెలంగాణ విద్యాశాఖ అకౌంట్లలో వేసింది. 79 వేల మంది ప్రైవేట్‌ టీచర్లకు అకౌంట్స్‌లో నగదు జమ చేశారు. ఇప్పటికే లక్షా 25 వేల మంది ప్రైవేట్ స్కూల్స్ సిబ్బందికి నగదు జమ చేశారు. రెండ్రోజుల్లో ప్రైవేట్‌ టీచర్లకు మే నెల ఆర్థిక సాయం అందజేస్తారు. గత నెల బియ్యం అందని వారికి రెండు నెలలు కలిపి 50 కేజీల బియ్యాన్ని ఇవ్వనున్నారు.


కరోనాతో విద్యసంస్థలను మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు స్కూల్ టీచర్లకు ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైవేలు టీచర్లకు నెలకు రూ. 2వేల ఆర్ధిక సాయంతో పాటు 25 కేజీల బియ్యాన్ని అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం సాయం పొందడం కోసం ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, ఇతర సిబ్బంది బ్యాంక్ ఖాతా తదితర వివరాలతో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని కేసీఆర్ సూచించిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-05-19T21:23:39+05:30 IST