ప్రైవేటీకరణను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-09-19T05:14:06+05:30 IST
ప్రైవేటీకరణను రద్దు చేయాలి
తాండూరు: కార్మిక ప్రైవేటీకరణను, ఎన్పీఎస్ ను వెంటనే రద్దు చేయాలని పాత పెన్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శనివారం రైల్వే కార్మికులు తాండూరు రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బ్రాంచ్ నాయకులు పాషం లక్ష్మీనారాయణ, కార్యదర్శి అరుణ్ చౌరి, వాజిద్ మాట్లాడుతూ బోన్సపై 7వేల సీలింగ్ను ఎత్తివేయాలని, ఏరియర్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం నుంచి బకాయి ఉన్న డీఏను పూర్తిగా చెల్లించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి.రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.