ఆదివాసీ దినోత్సవంపై ప్రియాంక ఆసక్తికర ట్వీట్

ABN , First Publish Date - 2020-08-09T18:53:09+05:30 IST

ఆదివాసీలతో కలిసి పొలం గట్లపై నడుస్తున్న తన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ప్రియాంక.. ‘‘నీళ్లు వారివి.. అడవి వారిది.. నేల వారిదే.. నీళ్లు, అడవి

ఆదివాసీ దినోత్సవంపై ప్రియాంక ఆసక్తికర ట్వీట్

న్యూఢిల్లీ: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆదివాసీ ప్రాంతంపైన ఆదివాసీ అస్థిత్వంపైన ఆదివాసీ వనరులపైన ఆదివాసీలే పూర్తి హక్కు దారులని ఆమె చెప్పుకొచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి సంకల్పానికి మనం మరింత మద్దతు చేకూర్చుదామని పిలుపునిచ్చారు.


ఆదివాసీలతో కలిసి పొలం గట్లపై నడుస్తున్న తన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ప్రియాంక.. ‘‘నీళ్లు వారివి.. అడవి వారిది.. నేల వారిదే.. నీళ్లు, అడవి, భూమి వారికే ఉండాలి. వారే వాటి హక్కుదారులు.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ హక్కులను రక్షించాలనే సంకల్పానికి మరింత మద్దతు చేకూర్చుదాం’’ అని రాసుకొచ్చారు. దానితో పాటు ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

Updated Date - 2020-08-09T18:53:09+05:30 IST