టెలికాం సంస్థలకు ప్రియాంక గాంధీ లేఖ
ABN , First Publish Date - 2020-03-30T18:20:29+05:30 IST
టెలికాం సంస్థలకు ప్రియాంక గాంధీ లేఖ
ఢిల్లీ: వలస కార్మికులకు ఉచితంగా మొబైల్ సర్వీసులు అందించాలని టెలికాం సంస్థలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లేఖలు రాశారు. లాక్డౌన్ వల్ల వలస కార్మికులు భోజనం, వసతి సౌకర్యాలు లేకుండా వందల కిలోమీటర్లు కాలినడకన స్వగ్రామాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. వారి వద్ద ఫోన్లలో రీఛార్జ్లకు కూడా డబ్బులు ఉండవు..నెల రోజుల పాటు వారికి ఉచితంగా అవుట్గోయింగ్ ఇవ్వాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.