సమస్యల పరిష్కారానికి చర్యలు : అదనపు కలెక్టర్ డేవిడ్
ABN , First Publish Date - 2021-03-02T04:48:13+05:30 IST
అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఆదిలాబాద్టౌన్, మార్చి1: అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలు పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ ఫిర్యాదుల విభాగంలో భూ సమస్యలు, పింఛన్ల మంజూరు, ఉపాఽధి కల్పన, డబుల్ బెడ్రూం మంజూరు చేయాలని అర్జీలు రావడం జరిగిందని, వాటిని ఆయా శాఖల అధికారులకు పంపించి చర్యలు చేపడతామన్నారు. ఇందులో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ సీవీఎన్ రాజు, ఎల్డీఎం చంద్రశేఖర్, సంక్షేమ అధికారులు ఆశన్న, శంకర్, మిల్క, కృష్ణవేని, వ్యవసాయ శాఖ ఏడీ రమేష్, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు నలంద ప్రియ, పలు శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.