సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-01-21T04:14:18+05:30 IST
కస్తూర్బాగాంధీ పాఠశాలలోని ఉపాధ్యాయుల సమస్య లు పరిష్కరించాలని బుధవారం టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయు లు నిరసన చేపట్టారు.
కోటపల్లి, జనవరి 20: కస్తూర్బాగాంధీ పాఠశాలలోని ఉపాధ్యాయుల సమస్య లు పరిష్కరించాలని బుధవారం టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయు లు నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా సెలవులు ఇవ్వాలని, హాస్టళ్లకు కేర్ టేకర్లను నియమించాలని, సమాన పనికి సమాన వేతనం అం దించాలని, హెల్త్కార్డులు జారీ చేయాలన్నారు. ఈనెల 29న జిల్లా కేంద్రంలో దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. లావణ్య, తిరుపతి, సునీల్ పాల్గొన్నారు.
దండేపల్లి: కస్తూర్బా విద్యాలయంలో పని చేస్తున్న ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. కొట్టె చంద్రమౌళి, తులసిపతి, మల్లేశం పాల్గొన్నారు.
కాసిపేట: కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని నిరసన చేపట్టారు. రాధోడ్ దిలీప్, సునీత, తులసీ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
భీమారం: కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న బోదన, బోధనేతర సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని నిరసన చేపట్టారు. అశోక్, సంతోష్, కుమార్, జైపాల్, సిబ్బంది పాల్గొన్నారు.