పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-06-24T05:01:52+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో సైనికుల్లా పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు తీర్చాలని ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు అజయ్‌బాబు డిమాండ్‌ చేశారు.

పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న నాయకులు

ఆదోని, జూన్‌ 23: కరోనా విపత్కర పరిస్థితుల్లో సైనికుల్లా పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు తీర్చాలని ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు అజయ్‌బాబు డిమాండ్‌ చేశారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయం ముందు ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ పారిశుధ్య కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, పారిశుధ్య కార్మికులకు జీతాలతోపాటు హెల్త్‌ అలవెన్స్‌ పెంచాలని, ఆప్కాస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అమ్మఒడి, ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కోరారు. పీఆర్సీ ప్రభుత్వం ప్రకటించాలని, రెగ్యులర్‌ కార్మికులకు జీపీఎఫ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో హుసేని, జయరాజు, జాన్‌బాబు, ఎల్లప్ప, శాంత, అంజని, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:01:52+05:30 IST