ఏజెన్సీలో జీడిపిక్కల ప్రోసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
ABN , First Publish Date - 2021-03-06T06:07:45+05:30 IST
ఏజెన్సీలో 61 వందన వికాస కేంద్రాల ద్వారా జీడిపిక్కల ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య అన్నారు.
రంపచోడవరం, మార్చి 5: ఏజెన్సీలో 61 వందన వికాస కేంద్రాల ద్వారా జీడిపిక్కల ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య అన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఏడు మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ జీడిమామిడి పిక్కలు, పసుపు, చింతపండు తదితర ఉత్పత్తులను వందన వికాస కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నట్టు ఆయన చెప్పారు. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా వివిధ పథకాలపై అ వగాహన కల్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు.
- దిశా చట్టంపై అవగాహన కల్పించాలి
దిశా చట్టంపై మహిళా సంఘాలు, అంగనవాడీ కార్యకర్తలకు గ్రామ సచివాలయ మహిళా పోలీసులు అవగాహన కల్పించాలని ఐటీడీఏ పీవో అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో వెలుగు ఏపీఎంలు, గిరిజన సంక్షేమశాఖ డీడీ, ఏటీడబ్ల్యువో, సీడీపీవోలు, సచివాలయ మహిళా పోలీసులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏఎస్పీ బిందూమాధవ్ మాట్లాడుతూ దిశా చట్టం ద్వారా యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఆయా సమావేశాల్లో డీడీ ఎం.సరస్వతి, ఏడీఎంహెచవో వంశీ, వెలుగు ఏపీడీ చిన్నశ్రీనివాసరావు, ఏటీడబ్ల్యువోలు సుజాత, శంభుడు, ఎస్వో వెంకటేశ్వరరావు, సీడీపీవోలు జి.వరహాలు, కాంత్రికుమారి, ఏపీఎంలు పాల్గొన్నారు.