ప్రజా పోరాటాలను బలోపేతం చేయాలి
ABN , First Publish Date - 2021-01-20T05:11:54+05:30 IST
ప్రజా పోరాటాలను బలోపేతం చేయాలి
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
కాకతీయఖని, జనవరి 19: టీజేఎస్ చేస్తున్న ప్రజా పోరాటాలను బలోపేతం చేయాలని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి ఏరియాలోని పలు బొగ్గు గనులు, ఏరియా ఆస్పత్రిని, ప్రభుత్వ కార్యాలయాలను ఆయన మంగళారం సందర్శించారు. టీజేఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నామో అది నెరవేరడం లేదన్నారు. అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మరచిపోయిందని విమర్శించారు. సంపాదనే ధ్యేయంగా ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరిదన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో తాను గెలిస్తే ప్రజా ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. కార్యక్రమంలో నాయకులు కామెర గట్టయ్య, పీక కిరణ్, లింగారెడ్డి, పుల్ల ప్రతాప్, సతీష్, ఎల్.సతీష్ తదితరులు పాల్గొన్నారు.