వరి పంటను పరిశీలించిన ప్రొఫెసర్లు

ABN , First Publish Date - 2021-01-17T04:09:40+05:30 IST

వరి పంటను పరిశీలించిన ప్రొఫెసర్లు

వరి పంటను పరిశీలించిన ప్రొఫెసర్లు
గుడూరులో వరి పంటను పరిశీలిస్తున్న మహిళా ప్రొఫెసర్లు

కొత్తూర్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం దత్తత తీసుకున్న గుడూర్‌ గ్రామంలో వరి పంట, కూరగాయల సాగును శనివారం వర్సిటీ ప్రొఫెసర్లు పరిశీలించారు. వరిలో జింక్‌ లోపం ఉందని, నారుపై జింక్‌ సల్ఫేట్‌ పిచిచారి చేయాలని వారు రైతులకు సూచించారు. ఆనంతరం కూరగాయల పంటలను పరిశీలించి చీడపీడలపై తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ శ్రీరంజిత, డాక్టర్‌ శకుంతలాదేవి, సర్పంచ్‌ సత్తయ్య, ఏఈవో సన, రైతులు మల్లారెడ్డి, విఠలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T04:09:40+05:30 IST