జంట హత్యల కేసులో పురోగతి
ABN , First Publish Date - 2020-06-07T06:40:47+05:30 IST
నగరంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది.
అనుమానితులను విచారిస్తున్న పోలీసులు
శ్రీకాకుళం క్రైం, జూన్ 6: నగరంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. గత ఏడాది ఫిబ్రవరి 7న బొందిలీపురంలోని సింధూజ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అత్తాకో డళ్లు జూరాబాయి (65), మెహరున్నీషా (35)లు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయినా హంతకులు పట్టుబడలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎంతో మంది పోలీసు అధికారులకు బదిలీ అయ్యింది. ఆ తరువాత వచ్చిన ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు ఈ జంట హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. దీంతో కొన్ని ఆధారాలు దొరికినట్టు సమాచారం. శుక్రవారం పలువురి అనుమా నితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, పోలీసులు తమ వారిని పట్టుకెళ్లిపోయారంటూ కుటుంబ సభ్యులు ఎస్పీని శనివారం కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపె విచారణకు ఎస్పీ ఆదేశించారు.