ఎస్సారార్కు కొనసాగుతున్న ఇన్ఫ్లో, అవుట్ఫ్లో
ABN , First Publish Date - 2020-02-28T11:45:23+05:30 IST
ఎస్సారార్కు కొనసాగుతున్న ఇన్ఫ్లో, అవుట్ఫ్లో
బోయినపల్లి, పిబ్రవరి 27: బోయినపల్లి మండలంలోని ఎస్సారార్ ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో కొనసాగుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని గాయత్రి పంప్హౌస్ నుంచి గురువారం 5,662 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరింది. ఇక్కడి నుంచి ఎల్ఎండీ ప్రాజెక్ట్కు 5,662 క్యూసెక్కుల నీటిని విడు దల చేశారు. ప్రాజెక్ట్ పూర్థి స్థాయి నీటి మట్టం 318 మీటర్లకు 317.11 మీటర్లు ఉంది. పూర్థి స్థాయి నీటి సామార్థ్యం 25.873 టీఎంసీలకు 25.272 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నేడు ప్రాజెక్ట్ను సందర్శించనున్న ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు
శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని శుక్రవారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ సీఎం ఓఎస్డీ దేశ్పాండే, ఇరిగేషన్ చీఫ్ మురళీధర్, కాళేశ్వరం 2 ఈ ఎన్సీ హరిరామ్ సందర్శించున్నారు. ఉదయం 9 గంటకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్నారు. 9,45 గంట టకు ఎస్సారార్ ప్రాజెక్ట్ వద్దకు చేరుకోనున్నారు. ప్రాజెక్ట్ను పరిశీలించిన అనంతరం 10 గంటలకు తిరిగి రంగనాయక సాగర్ వెళ్లనున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.