వాణిజ్య పంటలను ప్రోత్సహించండి

ABN , First Publish Date - 2021-06-12T04:42:14+05:30 IST

వాణిజ్య పంటలను ప్రోత్సహించండి

వాణిజ్య పంటలను ప్రోత్సహించండి
వ్యవసాయాధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: వరితోపాటు వాణిజ్య పంటలు, కూరగాయలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వ్యవసాయాధికారులకు సూచించారు. ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వానాకాలం సీజన్‌లో వరి సాగును వీలైనంతమేర తగ్గించుకునేట్లు చూడాలన్నారు. పత్తి, కందులు, మినుములు తదితర పంటలను వేసుకోవాలన్నారు. ఈ సీజన్‌కు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఏడీఏ సత్యనారాయణ, ఏఈలు వరప్రసాద్‌రెడ్డి, సందీప్‌కుమార్‌, శాంతిశ్రీ, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులున్నారు.


Updated Date - 2021-06-12T04:42:14+05:30 IST