పురపాలక శాఖలో డీఈఈలకు పదోన్నతి

ABN , First Publish Date - 2021-05-07T12:22:28+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పురపాలక శాఖలో పనిచేస్తున్న 13 మంది డీఈఈలకు ఈఈలుగా పదోన్నతి లభించింది. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి గురువారం

పురపాలక శాఖలో డీఈఈలకు పదోన్నతి

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పురపాలక శాఖలో  పనిచేస్తున్న 13 మంది డీఈఈలకు ఈఈలుగా పదోన్నతి లభించింది.  ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో కొందరిని ప్రస్తుతం పనిచేస్తున్న చోటే కొనసాగించగా, మరికొందరిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లుగా ప్రమోషన్లు పొందిన వారిలో.. ఎస్‌.మత్స్యరాజు, డి.విజయకుమారి, ఎం.నారాయణ స్వామి, టి.వీరభద్ర రావు, కె.రఘుకుమార్‌, ఎస్‌.శేఖర్‌, బి.సురేష్‌ కుమార్‌, డి.భూషణం, పి.శ్రీకాంత్‌, పి.వేణుగోపాల్‌, వి.శ్రీనివాస్‌, పి.తులసీకుమార్‌, ఎస్‌.సత్యనారాయణ రావు ఉన్నారు. 

Updated Date - 2021-05-07T12:22:28+05:30 IST