వ్యవసాయ కళాశాలలో పలువురికి పదోన్నతులు
ABN , First Publish Date - 2021-06-18T06:24:20+05:30 IST
తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలో పనిచేసే పలువురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లగా పదోన్నతి కల్పిస్తు అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.
తిరుపతి(విద్య), జూన్ 17: తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలో పనిచేసే పలువురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లగా పదోన్నతి కల్పిస్తు అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతిపై వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతున్న ఉద్యోగులకు కళాశాల ఏడీ రవీంద్రనాథ్రెడ్డి గురువారం సంబంధిత పత్రాలు అందజేశారు. ఇంజనీరింగ్ విభాగంలో సురేష్, అకడమిక్ విభాగంలో బీఎస్ఎస్ శర్మ, బాలికల వసతి గృహంలో మునిలావణ్య, క్యాషియర్ మునిశేఖర్రెడ్డి, వ్యవస్థాపక విభాగంలో సుశీల పదోన్నతి పొందారు. వీరిని ఏడీతో పాటు బోధనేతర ఉద్యోగుల సంఘ నాయకులు సుబ్రహ్మణ్యంరెడ్డి, గోపి, నాగరాజ, చిన్నరెడ్డెన్న, మునిరామ్ తదితరులు అభినందించారు.