వ్యభిచార గృహంపై దాడి.. నిర్వాహకురాలు అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-04-14T05:13:47+05:30 IST

యువతులను తీసుకువచ్చి తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను ఏలూరు రూరల్‌ ఎస్‌ఐ చావా సురేష్‌ అరెస్ట్‌ చేశారు.

వ్యభిచార గృహంపై దాడి.. నిర్వాహకురాలు అరెస్ట్‌

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 13 : యువతులను తీసుకువచ్చి తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను ఏలూరు రూరల్‌ ఎస్‌ఐ చావా సురేష్‌ అరెస్ట్‌ చేశారు. ఏలూరు బీడీ కాలనీలో నాగరాజు శిరీష (24) నివాసం ఉంటుంది. ఆమె కొంత మంది యువతుల ను తీసుకువచ్చి ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుంది. ఈ సమాచారం ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ డి.దిలీప్‌ కిరణ్‌కు అందడంతో ఆయన ఆదేశాల మేరకు రూరల్‌ ఎస్‌ఐ చావా సురేష్‌ దాడి చేశారు. అక్కడ ఉన్న శిరీషను అరెస్ట్‌ చేశారు. వ్యభిచారం కోసం తీసుకువచ్చిన 23 ఏళ్ల యువతిని పోలీసులు సంరక్షణా గృహానికి తీసుకువచ్చారు. 

Updated Date - 2021-04-14T05:13:47+05:30 IST