మసాజ్ ముసుగులో Prostitution
ABN , First Publish Date - 2021-11-10T17:30:18+05:30 IST
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రంపై సనత్నగర్ పోలీసులు దాడి చేశారు. విటుడు, నిర్వాహకులతో సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు
హైదరాబాద్/సనత్నగర్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రంపై సనత్నగర్ పోలీసులు దాడి చేశారు. విటుడు, నిర్వాహకులతో సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ ముత్తుయాదవ్ తెలిపిన వివరాలు ప్రకారం.. మూసాపేట సమీపంలోని భవానీనగర్లో ఆర్ట్స్పా సెంటర్ను బీమ్సింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు సోమవారంరాత్రి దాడి చేశారు. నిర్వాహకుడు బీమ్ సింగ్తో పాటు అతని ఇద్దరి అనుచరులు, ఓ వృద్ధుడు, కోలకతాకు చెందిన ఆరుగురు యువతులను అరెస్టు చేశారు. నిందింతులను రిమాండ్కు తరలించామని పోలీసులు పేర్కొన్నారు.