గృహాలు, స్థలాలకు రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2021-02-25T04:50:57+05:30 IST

ఇరవై ఏళ్లుగా గృ హాలు నిర్మించుకుని ని వాసం ఉం టున్న గృహాలకు, కొనుగోలు చేసిన స్థలాలకు రక్షణ కల్పించి వైసీపీ నేతల బెదిరింపుల నుం చి కాపాడాలని 1010/2 స్థలం నివాసితులు మహబూబ్‌నగర్‌ కాలనీ వాసులు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

గృహాలు, స్థలాలకు రక్షణ కల్పించండి
తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కాలనీవాసులు

పోరుమామి ళ్ల, ఫిబ్రవరి 24: ఇరవై ఏళ్లుగా గృ హాలు నిర్మించుకుని ని వాసం ఉం టున్న గృహాలకు, కొనుగోలు చేసిన స్థలాలకు రక్షణ కల్పించి వైసీపీ నేతల బెదిరింపుల నుం చి కాపాడాలని 1010/2 స్థలం నివాసితులు మహబూబ్‌నగర్‌ కాలనీ వాసులు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో కాలనీవాసులు మాట్లాడుతూ రంగసముద్రం పంచాయతీ పరిధిలో 1010/2లో 20 ఏ ళ్ల నుంచి గృహాలు నిర్మించుకుని ఉన్నామన్నారు.

ఇటీవల వైసీపీ నేత లు స్థలాలు ఖాళీ చేయాలని, ఇళ్లు కూలదోస్తామని, ఆ స్థలం తమ బంధువులదని బెదిరించారన్నారు. ఇరవై రోజుల కిందట అతను తెచ్చి న వంశవృక్షం నకిలీదని విచారించమని రెవెన్యూ అధికారులకు విన్నవించినా వారు తమ దగ్గర ఉన్న ఆధారాలు పట్టించుకోకుండా వారికే సహకరిస్తున్నారన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారు రమణమ్మ కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు తిరుమలశెట్టి సుబ్బారావు, కాలనీకి చెందిన నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T04:50:57+05:30 IST