బొగ్గు పరిశ్రమల ప్రైవేటీకరణపై నిరసన
ABN , First Publish Date - 2020-05-19T10:43:23+05:30 IST
బొగ్గు పరిశ్రమలను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా సోమవారం మణుగూరు ఏరియాలో జేఏసీ కార్మిక సంఘాల
మణుగూరురూరల్, మే18 : బొగ్గు పరిశ్రమలను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా సోమవారం మణుగూరు ఏరియాలో జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజావ్యతిరేకమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు వై రాంగోపాల్, వెలగపల్లి జాన్, మిట్టకోలు లక్షాద్రి, కొడిపల్లి శ్రీనివాస్, నాసర్పాషా ఉన్నారు.