రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన

ABN , First Publish Date - 2020-06-03T11:14:02+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సాక్షిగా జర్నలి స్టులకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి గాను టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా శాఖ

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సాక్షిగా జర్నలి స్టులకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి గాను టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ అమరవీరులకు, కరోనా మృతుల కు నివాళులర్పించి నిరసన వ్యక్తం చేశారు.


తెలంగాణలోని జర్నలిస్టుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై టీయూడబ్ల్యుజే ఐజేయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన తెలుపుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్‌జోషి తెలిపారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని అమ రవీరుల స్థూపానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరిచి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు.

Updated Date - 2020-06-03T11:14:02+05:30 IST