‘శుక్రవారం ప్రగతి భవన్ వద్ద నిరసన’
ABN , First Publish Date - 2020-08-06T19:16:22+05:30 IST
'ముఖ్యమంత్రి మేలుకో.. ప్రజలను కాపాడు' అనే నినాదంతో
హైదరాబాద్: 'ముఖ్యమంత్రి మేలుకో.. ప్రజలను కాపాడు' అనే నినాదంతో శుక్రవారం ప్రగతి భవన్ వద్ద నిరసన తెలుపుతామని చాడ వెంకట్ రెడ్డి, కోదండరాం తెలిపారు. కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చాడ, టీటీడీపీ నేత ఎల్ రమణ విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో కమ్యూనిస్టులు, టీజేఎస్, టీటీడీపీ, ప్రజా సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. పేదలకు ఆరునెలలపాటు ఉచితంగా రేషన్ ఇవ్వాలని చాడ, రమణ, కోదండరాం డిమాండ్ చేశారు.