సచివాలయంలో ఆర్థిక శాఖ ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2021-08-02T21:39:23+05:30 IST
సచివాలయంలో ఆర్థిక శాఖ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఆర్థిక శాఖ ఉద్యోగుల సీనియార్టీని ఫైనల్ చేయకపోవడంపై
అమరావతి: సచివాలయంలో ఆర్థిక శాఖ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఆర్థిక శాఖ ఉద్యోగుల సీనియార్టీని ఫైనల్ చేయకపోవడంపై నిరసన తెలిపారు. గత ఏడాది ఆగస్టులో ఆర్థిక శాఖ ఉద్యోగుల సీనియార్టీ ఫైనల్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలు అమలుకాకపోవడంతో ఆర్థిక శాఖ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. 2016 నుంచి ఇప్పటివరకు ఆర్థిక శాఖలో ఉద్యోగుల సీనియార్టీని ఉన్నతాధికారులు ఫైనల్ చేయలేదు. ఎనిమిది మిడిల్ లెవల్ పోస్టులు భర్తీ చేయడంలోఅధికారుల జాప్యం చేస్తున్నారు. జాప్యంతో ఉన్నతాధికారులకు ఉద్యోగులకు సమన్వయం కొరవడింది.