రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-04T05:20:11+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు సంఘీభావంగా ఎర్రగొండపాలెం ఏపీ రైతు సంఘం నాయకులు గురువారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలి

ఎర్రగొండపాలెం, డిసెంబరు 3: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు సంఘీభావంగా ఎర్రగొండపాలెం ఏపీ రైతు సంఘం నాయకులు గురువారం తహసీల్దార్‌  కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.  కార్యక్రమానికి న్యాయకత్వం వహించిన రైతు సంఘం గౌరవ అధ్యక్షుడు టీసీహెచ్‌ చెన్నయ్య మాట్లాడుతూ ఈ చట్టాలు భవిష్యత్తులో రైతు పండించిన పంట ఉత్పత్తులకు మద్దతుధర లభించదన్నారు. రైతులందరూ ఢిల్లీ రైతులకు సంఘీభావం తెలపాలన్నారు. అనంతరం  డీటీ వీరయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ కార్యవర్గ సభ్యులు కేవీ కృష్ణగౌడ్‌, మండల కార్యదర్శి  కే.గురవయ్య, సభ్యులు తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, ఎం వెంకటేశ్వర్లు, చట్టం వీరయ్య, ఎన్‌ పాండు, ఎన్‌ ఏగయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:20:11+05:30 IST