ఉపాధ్యాయుల బదిలీలపై నిరసన

ABN , First Publish Date - 2021-10-08T05:39:12+05:30 IST

పట్టణంలోగల పొట్టి శ్రీరాములు మునిసిపల్‌ ఉన్న త పాఠశాలలో ఉపాధ్యాయుల అక్రమ డెప్యుటేషన్లు, బదిలీలకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

ఉపాధ్యాయుల బదిలీలపై నిరసన
ధర్నా చేస్తున్న విద్యార్థులు

బొబ్బిలిరూరల్‌: పట్టణంలోగల పొట్టి శ్రీరాములు మునిసిపల్‌ ఉన్న త పాఠశాలలో ఉపాధ్యాయుల అక్రమ డెప్యుటేషన్లు, బదిలీలకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.రవికుమార్‌ మాట్లాడు తూ 465 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు సరిప డా ఉపాధ్యాయులు లేరని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఉపా ధ్యాయులు తమకు నచ్చిన ప్రాంతానికి డెప్యుటేషన్‌ గానీ, బదిలీ గానీ చేయించుకుంటున్నారన్నారు. ముగ్గురు తెలుగు ఉపాధ్యాయులు పనిచే యాల్సి ఉండగా, ఇద్దరు మాత్రమే ఉన్నారని, వారిద్ధరినీ అడ్డుగోలుగా బదిలీ చేశా రన్నారు.  తక్ష ణం డెప్యుటేష న్లను రద్దు చేసి పూర్తిస్ధాయిలో ఉపాధ్యాయు లను నియమించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్‌, వీర్రాజు, శ్రీనివాసరావు, జోసెఫ్‌, చంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-08T05:39:12+05:30 IST