పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన
ABN , First Publish Date - 2021-06-20T06:00:48+05:30 IST
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని లేబర్ కోర్డు చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
కళ్యాణ్నగర్, జూన్ 19: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని లేబర్ కోర్డు చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. పార్టీ డివిజన్ కార్యదర్శి ఈదునూరి నరేష్, నాయకులు తోకల రమేష్, అబె ద్నెగో, దుర్గయ్య, సాంబయ్య, చంద్రయ్య, అన్వేష్, మల్లేశం, శంకర్, అశో క్, ప్రసాద్, శ్రీధర్, రాజన్న పాల్గొన్నారు.