వ్యవసాయ బిల్లులపై 25న నిరసనలు

ABN , First Publish Date - 2020-09-24T09:21:34+05:30 IST

వ్యవసాయ బిల్లులపై 25న నిరసనలు

వ్యవసాయ బిల్లులపై 25న నిరసనలు

అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ 


హైదరాబాద్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నెల 25న నిరసనలు చేపట్టనున్నట్లు అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ రాష్ట్ర శాఖ ప్రతినిధులు ఆరోపించారు. మఖ్దూం భవన్‌లో బుధవారం అఖిల భారత రైతు పోరాట  సమన్వయ కమిటీ రాష్ట్ర శాఖ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌ లో రైతు వ్యతిరేక బిల్లులు ఆమోదించిన తీరు అప్రజాస్వామికమని, దీనిపై రాష్ట్రపతి స్పందించాలని కోరారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నెల 25న తలపెట్టిన నిరసనలను విజయవంతం చేయాలని కోరారు. కాగా, పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 90 శాతం కార్పొరేట్‌  సంస్థలకు ఉపయోగపడేవిధంగా ఉన్నాయనితెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రపతికి పంపాలని ఎఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్‌.ఎన్‌.శంకర్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-09-24T09:21:34+05:30 IST