ఘనంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం

ABN , First Publish Date - 2021-10-18T04:35:29+05:30 IST

ఘనంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం

ఘనంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం
మోమిన్‌పేట: దుర్గామాత ఊరేగింపు

మోమిన్‌పేట/కొడంగల్‌: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో దుర్గామాతను ప్రతిష్ఠించగా ఆదివారం అమ్మవారి నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. డీజే పాటలతో, యువతీ యువకుల నృత్యాలతో, చిన్నారుల కోలాటాలతో గ్రామవీధుల గుండా దుర్గామాత ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం నందివాగు ప్రాజెక్టులో నిమజ్జనం నిర్వహించారు. కొడంగల్‌ మండలంలోని హస్నాబాద్‌లో దుర్గమాత నిమజ్ఞనం సందర్బంగా ఆదివారం అమ్మవారి పట్టువస్త్రాలు, సామగ్రిని వేలం నిర్వహించగా అదే గ్రామానికి చెందిన బోయినిసందప్ప రూ.55వేలకు వేలంలో దక్కించుకున్నాడు. దుర్గమాత వారోత్సవాల్లో భాగంగా అమ్మవారి వస్త్రాలు, సామగ్రిని వేలం నిర్వహించగా రూ.2లక్షల 55 వేలు వచ్చినట్లు దుర్గమాత ఉత్సవ కమిటీ సభ్యులు శివరాజ్‌, హన్మంతు, సూర్యప్రకాశ్‌, నందు, సందప్ప, రమేశ్‌, సురేశ్‌, తిరుమలేశ్‌, కాశప్ప తెలిపారు.

Updated Date - 2021-10-18T04:35:29+05:30 IST