ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం

ABN , First Publish Date - 2022-06-24T05:27:49+05:30 IST

బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన నీలకంఠేశ్వర సహిత అంజ నేయస్వామి ఆలయ ప్రాంగణంలో శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠాప నోత్సవం గురువారం వైభంగా నిర్వహించారు..

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం
హాజరైన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

బోయినపల్లి, జూన్‌ 23: బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన  నీలకంఠేశ్వర సహిత అంజ నేయస్వామి ఆలయ ప్రాంగణంలో శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠాప నోత్సవం గురువారం వైభంగా నిర్వహించారు.. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, సెస్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోగ ఆగయ్య, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు అనుముల భాస్కర్‌, మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్‌ కొనకటి లచ్చిరెడ్డి, వైస్‌ఎంపీపీ కొనకటి నాగయ్య, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ చిక్కాల సుధాకర్‌రావు, కొండం నారాణరెడ్డి హాజరయ్యారు.  ఆలయంలో పూజలు నిర్వహించి ధ్వజస్తంభ కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. 

Updated Date - 2022-06-24T05:27:49+05:30 IST