గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలి
ABN , First Publish Date - 2021-06-20T04:38:35+05:30 IST
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని శాత వాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేపల్లి సుజాత కోరారు.
- శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేపల్లి సుజాత
- పీహెచ్సీకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, పీపీఈ కిట్లు అందజేత
వీపనగండ్ల, జూన్19: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని శాత వాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేపల్లి సుజాత కోరారు. శనివారం మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రికి రూ. లక్షాయాబై వేల విలువైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, పీపీఈ కిట్లు, మాస్కులు కొవిడ్ టెస్టులకు అవసరమైన సామగ్రిని ప్రొఫెసర్ అందజేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వచ్చి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడేవారి కి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పేద ప్రజలకు నా ణ్యమైన వైద్యం అందాలనే ఉద్దేశంతో వీటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కరో నా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యురాలు షాబానా తస్లీమ్, సర్పంచు నరసింహారెడ్డి, పీహెచ్డీ స్కాలర్ శంకర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, మండల అధ్యక్షుడు మురళి, మౌలాలి, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.