ప్రజలకు మెరుగైన సేవలు అందించండి
ABN , First Publish Date - 2021-10-23T04:53:21+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీతంపేట ఐటీడీఏ పీవో బి.నవ్య ఆదేశించారు. శుక్రవారం పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. హిరమండలం, అంబావల్లి సచివాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు.
హిరమండలం: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీతంపేట ఐటీడీఏ పీవో బి.నవ్య ఆదేశించారు. శుక్రవారం పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. హిరమండలం, అంబావల్లి సచివాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివ రాలు ప్రజలందరికీ తెలిసేలా జాబితాలను ప్రదర్శించాలని సూచించారు. అనంతరం హిరమండలం పీహెచ్సీని సందర్శించారు. ఎంపీడీవో వెంకటరాజు, వైద్యాధికారి హేమలత ఉన్నారు.