నిర్వాసితులకు ఉపాధి కల్పించండి
ABN , First Publish Date - 2021-07-30T05:26:31+05:30 IST
రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్షాప్లో ఉపాధి కల్పించాలని కోరుతూ ఏపీఐఐసీ నిర్వాసిత నిరుద్యోగులు గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో తుంగ్లాం సంతోషిమాత ఆలయం నుంచి ఆటోనగర్ ఎఫ్ బ్లాక్కు ఆనుకుని వున్న రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్షాప్ వరకు ర్యాలీగా వెళ్లి ప్ల కార్డులతో నిరసన చేపట్టారు.
అక్కిరెడ్డిపాలెం, జూలై 29: రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్షాప్లో ఉపాధి కల్పించాలని కోరుతూ ఏపీఐఐసీ నిర్వాసిత నిరుద్యోగులు గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో తుంగ్లాం సంతోషిమాత ఆలయం నుంచి ఆటోనగర్ ఎఫ్ బ్లాక్కు ఆనుకుని వున్న రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్షాప్ వరకు ర్యాలీగా వెళ్లి ప్ల కార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతు భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఆయా పరిశ్రమల యాజమాన్యాలపై వుందన్నారు. వర్క్షాప్లో నిర్వాసితులు, స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా అధికారులు కృషిచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడి అధికారులకు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో నామన సింహాచలం, సలాది అచ్చిబాబు, కాకి ముత్యాలరెడ్డి, కొల్లి వెంకటరమణారెడ్డి, కాకి రామిరెడ్డి, కోన హరి, కె.వినోద్రెడ్డి పాల్గొన్నారు.