పౌష్టికాహారాన్ని అందించండి: జేసీ
ABN , First Publish Date - 2022-01-21T07:04:07+05:30 IST
కొవిడ్ బాధితులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని జేసీ రాజశేఖర్ ఆదేశించారు. విష్ణునివాసం కొవిడ్ సెంటర్ను ఆర్డీవో కనకనరసారెడ్డితో కలిసి తనిఖీచేశారు.
తిరుపతి(రవాణా), జనవరి 20: కొవిడ్ బాధితులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని జేసీ రాజశేఖర్ ఆదేశించారు. విష్ణునివాసం కొవిడ్ సెంటర్ను ఆర్డీవో కనకనరసారెడ్డితో కలిసి తనిఖీచేశారు. ఈ సందర్భంగా కొవిడ్ బాధితులకు అందిస్తున్న భోజన సదుపాయాలపై ఆరా తీసారు. ఆర్ఐ జానీబాష, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.