వాగేటికోన ద్వారా పొలాలకు నీరు అందించాలి
ABN , First Publish Date - 2020-05-18T11:16:21+05:30 IST
వాగేటికోన రిజర్వాయర్ ద్వారా రైతు ల పొలాలకు నీరు అందించాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్ర భుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ..
రైల్వేకోడూరు, మే, 17: వాగేటికోన రిజర్వాయర్ ద్వారా రైతు ల పొలాలకు నీరు అందించాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్ర భుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఇరిగేషన్శాఖాధికారులను ఆదేశించారు. ఆదివారం వాగేటికోన రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాగేటికోన రిజర్వాయర్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 12.28 కోట్లు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. వాగేటికోన రిజర్వాయర్ పూర్తియితే 3 వేల ఎకరాలకు సాగునీరు, చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందుతుందని తెలిపారు. ఇరిగేషన్, అటవీశాఖల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించామని తెలిపారరు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైసీపీ నాయకులు రామిరెడ్డి ధ్వజారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గుంటిమడుగు సుధాకర్రాజు,సయ్యద్ ఆదాంసాహెబ్ పాల్గొన్నారు.