కారుణ్య నియామక పత్రాలు అందజేత

ABN , First Publish Date - 2022-01-23T06:00:36+05:30 IST

మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌, చనిపోయిన ఉద్యోగుల వారసులకు 42మందికి కారుణ్య నియామకాల ఉత్తర్వులను శనివారం ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ అందజేశారు.

కారుణ్య నియామక పత్రాలు అందజేత
కారుణ్య నియామక పత్రాలు అందజేస్తున్న జీఎం

గోదావరిఖని, జనవరి 22: మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌, చనిపోయిన ఉద్యోగుల వారసులకు 42మందికి కారుణ్య నియామకాల ఉత్తర్వులను శనివారం ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎండీ శ్రీధర్‌ చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతుందని, మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి  వెంటనే అన్‌ఫిట్‌ చేయడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని, 42మందిలో ఆరుగులు మహిళలు ఉన్నారని, వీరికి త్వరలోనేఆర్‌జీ-1  ఏరియాలో పోస్టింగ్‌ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఆర్‌జీ-1 పరిధిలోని ఇప్పటి వరకు 1327 మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ కాగా అందులో 1026మందికి ఉత్తర్వులు అందించడం జరిగిందని, అదే విధంగా వంద మందికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ రూ25లక్షల చొప్పున, 9మందికి ఎంఎంపీ నెలకు రూ.25వేల చొప్పున చెల్లించడం జరుగుతుందని తెలిపారు. నూతనంగా ఉద్యోగాలు పొందిన యువకులు సీనియర్ల వద్ద పని మెళుకువలు నేర్చుకుని సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ ప్రతినిధి తిరుపతిరెడ్డి, పర్సనల్‌ అధికారులు శ్రావణ్‌, నరేన్‌, చక్రవర్తి, సీనియర్‌ పీఓ సారంగపాణి, మల్లీశ్వరి, వీరారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T06:00:36+05:30 IST